11న ‘సరిలేరు నీకెవ్వరు’.. 12న ‘అల వైకుంఠపురములో’ !

11న ‘సరిలేరు నీకెవ్వరు’.. 12న ‘అల వైకుంఠపురములో’ !

Published on Nov 22, 2019 2:52 PM IST

‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ బాబు, ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ ఒకేరోజు జనవరి 12న పోటీ పడనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ పోటీతో ఓపెనింగ్స్ దెబ్బతింటాయని బయ్యర్లు కంగారుపడిపోయారు. రిలీజ్ డేట్స్ ప్రకటించి పోటీకి తెర తీసిన నిర్మాతలు, హీరోలు ఇప్పుడు తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు. జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది. అలాగే ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న విడుదల కానుంది

ఈ నిర్ణయంతో మొత్తానికి రెండు రోజులు రెండు కొత్త సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఇలా ఈ సంక్రాంతిని ఇద్దరు స్టార్ హీరోలు పంచే వినోదంతో ప్రేక్షకులు వరుసగా రెండు రోజులను ఫుల్ గా ఎంజాయ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు