నైజాంలో 15కోట్లకు దగ్గరైన ‘సరైనోడు’..!

నైజాంలో 15కోట్లకు దగ్గరైన ‘సరైనోడు’..!

Published on May 3, 2016 7:49 PM IST

sarrinodu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవ్వరి ఊహకూ అందని రీతిలో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మొదట్లో అంతటా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ వెళుతోంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 11వ రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా 14.60కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

ఇక నేటితో ఈ సినిమా 15 కోట్ల మార్క్‌ను కూడా దాటేస్తుంది. ఇక ఇదే స్థాయిలో కలెక్షన్స్ మరో మూడు నాలుగు రాజులు కొనసాగితే, నైజాంలో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రేసుగుర్రం’ను సరైనోడు సినిమా దాటేస్తుందని తెలుస్తోంది. మొదట్లో వచ్చిన టాక్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా సరైనోడు ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు