గాంధీ దర్శకత్వంలో శర్వానంద్..

గాంధీ దర్శకత్వంలో శర్వానంద్..

Published on Jan 28, 2015 4:09 PM IST

shrwanadh-Merlapaka-Gandhi

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ, రెండవ సినిమాలో శర్వానంద్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇటివలే హీరోను కలిసి కథ వినిపించారు. శర్వానంద్ కు బాగా నచ్చడంతో గాంధీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అని హీరో సన్నిహిత వార్తలు తెలిపాయి.

శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ వంటి హిట్ సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ కాని, ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ‘జిల్’ సినిమా నిర్మాణ పనుల్లో యువి క్రియేషన్స్ బిజీగా ఉంది. ‘జిల్’ షూటింగ్ పూర్తయిన తర్వాత గాంధీ – శర్వానంద్ సినిమాపై కాన్సంట్రేట్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు