మరో సినిమాకి సైన్ చేసిన సత్యదేవ్ !

మరో సినిమాకి సైన్ చేసిన సత్యదేవ్ !

Published on Feb 21, 2017 5:46 PM IST


పూరి జగన్నాథ్ ఛార్మి ప్రధాన పాత్రలో రూపొందించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు సత్యదేవ్ ఆ చిత్రం తర్వాత ‘మన ఊరి రామాయణం’ సినిమాలో ఆటో డ్రైవర్ పాత్రలో నటించి ఆకట్టుకుని తాజాగా రిలీజైన ‘ఘాజి’ చిత్రంలో సైతం ఒక కీలకమైన పాత్ర పోషించి అందరి ప్రసంశలు పొందుతున్నాడు. ఈయన హీరోగా ఇటీవలె వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి ‘గువ్వా గోరింక’ అనే రొమాంటిక్ చిత్రాన్ని చేస్తుండగా సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమాలో హీరోగా కుదిరినట్టు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయమవుతూ చేయనున్న సినిమాలో సత్యదేవ్ ను కథానాయకుడిగా ఎంచుకున్నారట. ఈ థ్రిల్లర్ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగుకు వెళుతుందని, సత్యదేవ్ సరసన పూజ జావేరిని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై సంబంధిత వ్యక్తుల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు