బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్

బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్

Published on Dec 11, 2019 10:12 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది హీరోయిన్ షామిలి పాండే. ఐతే ఆ తరువాత అమ్మడుకి చెప్పుకోదగ్గ రోల్స్ దక్కలేదు. ఐతే 2020 ఆమెకు చాలా స్పెషల్ కానుంది. ఎందుకంటే షాలిని ఏకంగా బాలీవుడ్ మూవీలో అది కూడా రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. విషయంలోకి వెళితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ రణ్వీర్ హీరోగా ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా షాలిని పాండేను ఎంపిక చేసినట్లు వారు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.

మహిళా సాధికారత అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రణ్వీర్ సింగ్ విమెన్ ఎంపవర్మెంట్ కొరకు పనిచేసే గుజరాతి యువకుడైన జయేష్ భాయ్ పాత్ర చేస్తున్నారు. నూతన దర్శకుడు దివ్యాన్గ్ థక్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి బడా సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడంతో షాలిని ఆనందం వ్యక్తం చేశారు. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక షాలిని నటించిన ఇద్దరి లోకం ఒకటే మూవీ ఈనెల 25న విడుదలవుతుండగా, నిశ్శబ్ధం మూవీ వచ్చే ఏడాది జనవరి 31న విడుదల కానుంది.

https://www.instagram.com/p/B568pq_hMvq/?utm_source=ig_web_button_share_sheet

సంబంధిత సమాచారం

తాజా వార్తలు