మళ్ళీ జత కట్టనున్న శర్వానంద్-నిత్యా మీనన్!

మళ్ళీ జత కట్టనున్న శర్వానంద్-నిత్యా మీనన్!

Published on Apr 21, 2015 4:00 PM IST

malli-malli-edi-rani-roju
గత సంవత్సరం విడుదలై సంచలన విజయం సాధించిన మళయాల సినిమా ‘బెంగళూరు డేస్’ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్‌తో పాటు నివిన్, నాజ్రియా తదితరులు నటించిన ఈ సినిమా గత సంవత్సరం మళయాలంలో విడుదలైన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాను తమిళంలో పీవీపీ సంస్థ నిర్మిస్తుండగా, తెలుగులో దిల్‌రాజు నిర్మించనున్నారు.

తమిళ వర్షన్లో ఆర్య, రానా, బాబీ సింహాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వర్షన్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే తెలుగు రీమేక్ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్‌లు హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. ఇందులో నిత్యామీనన్ శర్వానంద్‌కు జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. బెంగళూర్ డేస్ ఒరిజినల్‌లో గెస్ట్ రోల్ చేసిన నిత్యా, ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేయనుండడం విశేషం! ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు