తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ ఈ మధ్యే ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి వరుస హిట్స్తో సూపర్ ఫామ్లో ఉన్నారు. తాజాగా శర్వానంద్ తన కొత్త సినిమా కోసం దర్శకుడు మేర్లపాక గాంధీతో జతకట్టిన విషయం తెలిసిందే. తమదైన బ్రాండ్ సినిమాలతో ఓ పంథా సృష్టించుకున్న యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇక ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో, డిఫరెంట్ కథాంశంతో రూపొందుతోన్న ఈ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో ఒక డిఫరెంట్ పాయింట్ను టచ్ చేస్తూ సూపర్ హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ, శర్వానంద్ స్టైల్లో ఓ మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న సినిమా యూనిట్ త్వరలోనే ఓ ఫస్ట్లుక్ రీలీజ్కు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్గా నటించారు.