శర్వానంద్ సినిమాని రీమేక్ చేయనున్న స్టార్ హీరో !

శర్వానంద్ సినిమాని రీమేక్ చేయనున్న స్టార్ హీరో !

Published on Feb 19, 2017 6:46 PM IST


యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో, తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా మంచి విజయాన్ని సాధించి పలు అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర దర్శకుడు దేవా కట్ట పలు సందర్భాల్లో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని, సమయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది.

సినీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని హిందీలో స్టార్ హీరో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేయనున్నారట. తెలుగు చిత్రాన్ని చూసిన సంజయ్ దత్ బాగా ఇంప్రెస్స్ అయినట్టు, దేవా కట్ట కూడా రీమేక్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక స్వయంగా ఆయనే సినిమానై నిర్మిస్తారని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజమవుతాయా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు