తమిళంలోకి ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’

తమిళంలోకి ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’

Published on May 27, 2015 3:35 AM IST

Malli-malli
‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’.. శర్వానంద్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమకథ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా చాన్నాళ్ళ తర్వాత తెలుగులో వచ్చిన అందమైన ప్రేమకథగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది.

తమిళంలో ‘నీ నాన్ నామ్’ (నువ్వు, నేను, మనం) అన్న పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో రెండు స్ట్రైట్ సినిమాల్లో నటించిన శర్వానంద్, ఆ సినిమాలతో అక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక నిత్యామీనన్‌కు కూడా తమిళంలో మంచి మార్కెట్ ఉంది. ‘ఒకే బంగారం’ విజయం తర్వాత నిత్యామీనన్, అక్కడి యూత్‌కి ఫేవరైట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తమిళంలో విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకులనూ ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా అన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు