కొత్త ఇంటికి చేరిన శృతి హాసన్.

కొత్త ఇంటికి చేరిన శృతి హాసన్.

Published on Sep 23, 2014 4:00 PM IST

Shruthi-Haasan-in-Yellow-22
యంగ్ హీరోయిన్ శృతి హాసన్… ముంబైలో తన మకాం మార్చేసింది. తాజాగా కొత్త ఇంటికి చేరుకుంది. గత కొన్ని రోజుల క్రితం ఒక ఆగంతకుడు శృతి హాసన్ అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన సంగతి తెలిసిందే. అ సంఘటన తర్వాత శృతి ఇల్లు మారాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికి కుదిరింది.

ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం అంధేరీలో శృతి హాసన్ కొత్త ఫ్లాట్ తీసుకుంది. ఈ డబల్ బెడ్ రూం ఫ్లాట్ ను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి శృతి స్వయంగా ఇంటీరియర్ డిజైనింగ్ పనులను పర్యవేక్షిస్తుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు