నటుడు కమల్ హాసన్ లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ’శభాష్ నాయుడు’ సినిమాను ప్రఖ్యాత మళయాల దర్శకుడు టీ.కే. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇండులో కమల్ హాసన్ కూతురుగా శృతిహాసన్ కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శృతిహాసన్ సరసన అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్, అమెరికన్ నటుడు మను నారాయణ్ నటించనున్నాడట. మను నారాయణ్ గతంలో ఎ.ఆర్.రెహమాన్ ’బాంబే డ్రీమ్స్’, ’లవ్ గురు’, ’వాల్ స్ట్రీట్- మనీ నెవర్ స్లీప్’ చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల్ హాసన్ కు జోడీగా నటిస్తోంది. షూటింగ్ ఎక్కువ భాగం లాస్ ఏంజల్స్ లో చేయబోతున్నట్లు సమాచారం.