మలేషియా షెడ్యూల్‌కు సిద్ధమైన ‘సింగం 3’

మలేషియా షెడ్యూల్‌కు సిద్ధమైన ‘సింగం 3’

Published on Aug 23, 2016 8:20 PM IST

singham-21
ఈ ఏడాది వేసవి సీజన్లో ’24’ సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన సూర్య, తాజాగా మాస్ హిట్ కొట్టేందుకు ‘సింగమ్ 3’ అనే సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తెలుగులో సూర్యకు తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన మాస్ సినిమాలైన ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం) సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ‘సింగం 3’ ప్రస్తుతం సౌతిండియన్ సినిమాల్లో సెట్స్‌పై ఉన్న వాటిల్లో క్రేజ్ ఉన్న ఓ సినిమాగా చెప్పుకోవచ్చు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 26 నుంచి మలేషియాలో మొదలుకానుంది.

చెన్నై, వైజాగ్ పరిసరాల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద ఎపిసోడ్ మలేషియా నేపథ్యంలో నడుస్తుందని , ఆ ఎపిసోడ్‌ సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు టీమ్ తెలిపింది. బిజినెస్‌ వర్గాల్లో ఎక్కడిలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా సుమారుగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతోందని ట్రేడ్ అంచనా వేస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సింగం సిరీస్‌లో గత రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి, మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు