రియల్ లైఫ్ స్టొరీతో రానున్న అనుష్క ‘సైజ్ జీరో’

రియల్ లైఫ్ స్టొరీతో రానున్న అనుష్క ‘సైజ్ జీరో’

Published on Nov 26, 2015 7:34 PM IST

size-zero
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన యోగ బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సైజ్ జీరో’. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు(నవంబర్ 27న) వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకి ప్రకాష్ కోవెల మూడి డైరెక్టర్. ఒక అమ్మాయి బాగా బొద్దుగా ఉండే ఆ అమ్మాయి పడే ఇబ్బందులేమిటి? అలాంటి అమ్మాయికి పెళ్లి చేయాలంటే వచ్చే సమస్యలేంటి అనే పాయింట్ ని ప్రధాన ఇతివృత్తంగా చెబుతూ చేసిన సినిమానే ఈ ‘సైజ్ జీరో’.

ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సైజ్ జీరో కథ రియల్ లైఫ్ స్టొరీ నుంచి పుట్టింది కావడం విశేషం.. ఈ సినిమా కథ రాయడం వెనకున్న అసలు కథ గురించి అనుష్క చెబుతూ ‘కనిక ఈ కథ నాకు చెప్పినప్పుడు ఎలా వచ్చింది ఈ ఐడియా అని అడిగితే.. కనిక వాళ్ళ బంధువుల్లో ఒకమ్మాయి బాగా బొద్దుగా ఉండడం వల్ల ఇప్పటికీ పెళ్లి కాలేదట. వాళ్ళింటికి వచ్చిన వాళ్ళంతా ఆ అమ్మాయికి అతి తినొద్దు, ఇది తినొద్దు అని ఆ ఆమ్మాయిని కామెంట్స్ చేస్తుండడం చూసిన కనిక ఆ పాయింట్ బాగా సెన్సిటివ్ గా ఉందని తీసుకొని దాని చుట్టూ కథ రాసుకుందని’ తెలిపింది. అనగా సైజ్ జీరో అనే కథ రియల్ లైఫ్ నుంచి తీసుకున్న కథ.

పివిపి నిర్మించిన ఈ సినిమాలో స్టార్స్ అయిన నాగార్జున, రానా రాగ్గుబాటి, రంగం ఫేం జీవ, తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సిక, లక్ష్మీ మంచు, శ్రీ దివ్య, రేవతిలు అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు