ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన యంగ్ హీరో !

ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన యంగ్ హీరో !

Published on May 24, 2017 4:46 PM IST


ప్రేక్షకుల్లో ఈ హీరో సినిమాకి వెళితే ఖచ్చితంగా కొంతైన కొత్తదనం దొరుకుతుంది అనే నమ్మకాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా చేసిన చిత్రం ‘కేశవ’. నిఖిల్ మీదున్న నమ్మకానికి ప్రీ రిలీజ్ బజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమాకి రూ. 11. 40 కోట్ల గ్రాస్ వసూలైంది. ఈ కలెక్షన్లతో కొత్త ఉత్తేజాన్ని నింపుకున్న టీమ్ ఇంకాస్త అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేసేందుకు సిద్ధమైంది.

అందుకోసం ప్రత్యేక ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. వాటిలో భాగంగా హీరో నిఖిల్, హీరోయిన్ రితు వర్మ, ఇతర ప్రధాన తారాగణం రేపు విజయవాడ వెళ్లి ప్రేక్షకుల్ని కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోనున్నారు. విజయవాడతో పాటే ఇంకొన్ని ప్రధాన నగరాలలో కూడా ఇదే రీతిలో ప్రమోషన్లు కొనసాగుతాయని తెలుస్తోంది. అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు