మహేష్ సినిమా కోసం విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల

మహేష్ సినిమా కోసం విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల

Published on May 26, 2015 4:01 PM IST

Srikanth_Addala

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న లాంచ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి లొకేషన్ల వేటలో పడ్డారు.

విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ ఆలయంలతో పాటు విజయవాడ పరిసరాలను దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఓసారి పరిశీలించారు. విజయవాడను ఇంతకుముందెన్నడూ చూడనంత అందంగా ఈ సినిమాలో చూపించేందుకు శ్రీకాంత్ అడ్డాల సిద్ధమయ్యారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు