నైజాంలో ల్యాండ్ మార్క్ దిశగా ‘శ్రీమంతుడు’

నైజాంలో ల్యాండ్ మార్క్ దిశగా ‘శ్రీమంతుడు’

Published on Aug 27, 2015 7:26 PM IST

Srimanthudu
ఒక క్రేజీ కాంబినేషన్లో సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ ఓ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆశిస్తారు కానీ ఎవరూ ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ని చెబుతూ కమర్షియల్ గా సినిమా చేస్తారని ఊహించరు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ మాత్రం శ్రీమంతుడు సినిమాతో ఈ బారియర్ ని చాలా ఈజీగా క్రాస్ చేసి ఓ సోషల్ మెసేజ్ ని చెబుతూనే అభిమానులకు, ప్రేక్షకులకు కావాలన్సిన అన్ని కమర్షియల్ అంశాలను సరిగా పొందు పరిచి తీసిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తూ అన్ని ఏరియల్లోనూ రికార్డ్ ఫిగర్స్ ని నమోదు చేస్తున్న ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 75 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.

ఓవరాల్ గానే కాకుండా ప్రతి ఏరియాలోనూ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను తెచ్చి పెట్టి, సూపర్బ్ ఫిగర్స్ ని నమోదు చేసింది. శ్రీమంతుడు సినిమా నైజాంలో కూడా సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. నైజాం నుంచి అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి 20 రోజుల్లో 19.5 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. ఈ రోజుతో 20 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. ఈ లెక్కన శ్రీమంతుడు మొదటి 3 వారాల్లో 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి న్యూ ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు