‘బాహుబలి 2’ లో పాపులర్ కమెడియన్!

‘బాహుబలి 2’ లో పాపులర్ కమెడియన్!

Published on Jan 18, 2017 3:25 PM IST

prudhvi
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రంపై ఎంతటి భారీ అంచనాలున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశారట. బాహుబలి – ది బిగినింగ్ కు పార్ట్ 2లో ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దేవసేన పాత్రలో కనిపించనున్న అనుష్కకు పృథ్వి మంత్రిగా నటించాడట.

ఆ పాత్ర పేరు ‘రాజగురు’ అని, అది తన మిగతా సినిమాల్లోలా కామెడీ తరహాలో ఉండదని, పూర్తి సీరియస్ గా నడిచే పాత్రని, బాహుబలి లాంటి గొప్ప చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పృథ్వి పై వివరాలను తెలిపారు. భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28వ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు