సినిమా విడుదలయ్యే సమయానికి స్టార్ హీరో భార్య మీద ట్రోలింగ్స్ !

సినిమా విడుదలయ్యే సమయానికి స్టార్ హీరో భార్య మీద ట్రోలింగ్స్ !

Published on Nov 9, 2020 5:00 PM IST

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ’. తెలుగు, త‌మిళ‌ భాషల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన `కాంచ‌న`కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాకు తొలుత‌ `ల‌క్ష్మీ బాంబ్` అని టైటిల్ పెట్టారు. కానీ అభ్యంతరాలు వ్యక్తమవడంతో బాంబ్ అనే పదాన్ని తొలగించి కేవలం ‘లక్ష్మీ’ ఒక్కటే ఉంచారు. అయినా సినిమా మీద ట్రోలింగ్స్ ఆగట్లేదు. దేవతలను అవమానిస్తారా అంటూ ఇప్పటికీ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజగా ఒక నెటిజన్ అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి స్టార్ నటి ట్వింకిల్ ఖన్నా మీద ట్రోల్స్ చేశాడు. ట్వింకిల్ ఫోటోను పూర్తిగా బ్లూ రంగులోకి మార్చేసి ఆమె ముఖానికి పెద్ద బొట్టు పెట్టి దానికి ‘ట్వింకిల్ బాంబ్’ అని పేరు పెట్టి ‘థ‌ర్డ్ క్లాస్ ప‌ర్స‌న్‌.. మీరు దేవుడి మీద జోకులేసి ఎగ‌తాళి చేస్తారా?` అని కామెంట్ చేశాడు. అది కాస్త బాగా వైరల్ అయి ట్వింకిల్ ఖన్నావరకు చేరిపోయింది. దీంతో ఆమె వెంటనే రిప్లై ఇచ్చారు.

ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి `అవును.. దేవుళ్ల‌కు జోకులంటే చాలా ఇష్టం.. లేక‌పోతే ఆమె నిన్ను చేసి ఉండేవారు కాదు’ అంటూ సమాధానం ఇద్దామనుకున్నాను అంటూ ఈ దీపావళికి కొత్త రంగుతో నిజమైన బ్లూ బాంబ్ షెల్ మాదిరి తయారవుతాను అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇకపోతే ఈ ‘లక్ష్మీ’ చిత్రం ఈరోజు రాత్రి 7 గంటల 5 నిముషాలకు ఓటీటీ ద్వారా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు