‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో రెండవ హీరోయిన్ !

‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో రెండవ హీరోయిన్ !

Published on May 19, 2018 12:06 PM IST

వరుస పరాజయాలతో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల బలమైన రీ ఎంట్రీ ఇవ్వడం కోసం చేస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ చిత్రంలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ ఉండనున్నారు. ఇప్పటికే ఒక పాత్ర కోసం అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకోగా మరొక పాత్రకు జోడీగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ను అనుకుంటున్నారట.

అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. శృతి హాసన్ గతంలో రవితేజతో కలిసి ‘బలుపు’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. హీరో సునీల్ ఒక కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు వంటి స్టార్ కమెడియన్లు నటిస్తున్నారు.

గతంలో రవితేజ, శ్రీను వైట్ల కలయికలో ‘వెంకి, దుబాయ్ శ్రీను’ వంటి ఎంటర్టైనర్లు రూపుదిద్దుకొని ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు