చిరంజీవితో మొదలుపెట్టి, రామ్ చరణ్ తో ముగిస్తున్నారు.

చిరంజీవితో మొదలుపెట్టి, రామ్ చరణ్ తో ముగిస్తున్నారు.

Published on Oct 25, 2014 4:24 PM IST

rk
సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు ఇలా సమాజంలో గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూలతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమానికి రేపటితో కొద్దికాలం పాటు శుభం కార్డ్ వేస్తున్నారు. ఒక నాలుగైదు నెలలు బ్రేక్ ఇస్తున్నట్టు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఈ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం 250 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. 250వ ఎపిసోడ్ లో చీఫ్ గెస్ట్ గా చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఇదే ఆఖరి ఎపిసోడ్ కావడం గమనార్హం. ఈ షోని మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభించి, రామ్ చరణ్ తో ముగిస్తుండడం విశేషం.

‘గోవిందుడు అందరివాడేలే’ విజయంతో సంతోషంగా ఉన్న చరణ్ ఈ కార్యక్రమంలో చాలా విషయాలు మాట్లాడినట్టు ట్రైలర్ చూస్తే అర్థమయింది. ఉపాసనతో ప్రేమాయణం, తండ్రి రాజకీయాలు, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుత రిలేషన్లపై మాట్లాడిన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. ఈ ఆదివారం రాత్రి 8.30 నిముషాలకు గ్రాండ్ ఎండింగ్ ఇస్తూ చివరి కార్యక్రమాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు