కేరళ అభిమానులను కలుసుకోనున్న అల్లు అర్జున్

కేరళ అభిమానులను కలుసుకోనున్న అల్లు అర్జున్

Published on Apr 20, 2015 10:47 PM IST

allu-arjun2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కుటుంబ కధా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయం సాధించడంతో పరమానందంలో వున్న బన్నీ అదే జోరులో తన తదుపరి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు. సన్నాఫ్ సత్యమూర్తి 40కోట్ల రికార్డు కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర దున్నేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ నెల 21న కేరళ ప్రయాణించనున్నాడు. బన్నీకి కేరళలో మంచి ఫ్యాన్ బేస్ వుండడమే దీనికి ప్రధాన కారణం. అక్కడ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ లను సాధించింది. బన్నీని అక్కడ మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఈ సినిమాలో ఉపేంద్ర నటించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు