స్మగ్లింగ్ స్టోరీ షూట్ కోసం సుకుమార్,బన్నీ ఆదేశం వెళ్లనున్నారట.

స్మగ్లింగ్ స్టోరీ షూట్ కోసం సుకుమార్,బన్నీ ఆదేశం వెళ్లనున్నారట.

Published on Nov 17, 2019 3:40 PM IST

అల్లు అర్జున్ తన 20వ చిత్రాన్ని లాజికల్ అండ్ కాలిక్యులేటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే గ్రాండ్ గా హైదరాబాద్ వేదికగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈచిత్రంపై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలో ఉంది.

ఈ చిత్ర షూటింగ్ కొరకు యూనిట్ సభ్యులు థాయిలాండ్ వెళ్లనున్నారట. థాయిలాండ్ లోని దట్టమైన అడవులలో ఫారెస్ట్ నేపథ్యంలో నడిచే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపాలని నిర్ణయించారట. గతంలో బన్నీ,సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2చిత్రాలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందాన నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు