‘జిందగీ’ రీమేక్ వార్తలను ఖండించిన సుమంత్..!

‘జిందగీ’ రీమేక్ వార్తలను ఖండించిన సుమంత్..!

Published on Jul 31, 2014 6:22 PM IST

Sumanth_swathi
సుమంత్, కలర్స్ స్వాతి, శ్రీవిష్ణు ప్రధాన తారాగణంగా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘జిందగీ నా మిలేంగి దుబారా’కు రీమేక్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. ‘జిందగీ నా మిలేంగి దుబారా’ సినిమా తనకు నచ్చిందని, కాకపోతే పవన్ సాధినేని సినిమాకు, ఆ సినిమాకు సంబంధం లేదని చెప్పారు.

రహదారి ప్రయాణంలో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా కొత్త సినిమా రూపొందనుందట. ఈ సినిమాకి ‘జిందగీ’ అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారంలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు