వేగం పెంచిన ‘శమంతకమణి’ టీమ్ !

వేగం పెంచిన ‘శమంతకమణి’ టీమ్ !

Published on Mar 28, 2017 3:00 PM IST


‘భలేమంచిరోజు’ ఫేమ్ శ్రీ రామ్ ఆదిత్య తాజాగా మల్టీ స్టారర్ చిత్రం ‘శమంతకమణి’ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలు సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి వినగానే ప్రేక్షకుల్లో ఇంతమంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమా అంటే కథ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దికుంటున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఒక్కొక్క హీరో ఎవరి డేట్స్ కు తగ్గట్టు వారు జాయిన్ అవుతూ వస్తున్నారు. ఈరోజు హీరో సందీప్ కిషన్ చిత్రీకరణలో పాల్గొన్నారు. మరొక నోటెడ్ హీరో నారా రోహిత్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు