ఆగిపోయిన సునీల్ – గోపి మోహన్ మూవీ!!

ఆగిపోయిన సునీల్ – గోపి మోహన్ మూవీ!!

Published on Nov 26, 2015 10:39 AM IST

sunil-gopimohan
కమెడియన్ గా పలు వేరియేషన్స్ చూపించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి ఆ తర్వాత హీరోగా మారిన నటుడు సునీల్. ఆయన హీరోగా చేసిన భీమవరం బుల్లోడు సినిమా వచ్చి ఏడాదిన్నర దాటినా మరో సినిమా రిలీజ్ కాలేదు. కృష్ణాష్టమి సినిమాని ఫినిష్ చేసిన సునీల్ ప్రస్తుతం వంశీ కృష్ణ ఆకెళ్ళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ కృష్ణ సినిమాకి సైన్ చేసిన టైంలోనే స్టార్ రైటర్ గా వెలుగొందుతున్న గోపి మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతూ అనిల్ సుంకర నిర్మాతగా ఓ సినిమా చేద్దాం అనుకున్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినప్పటికీ సునీల్ కమిట్ అయిన సినిమాలు వాయిదా పడుతూనే ఉండడంతో ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సునీల్ గోపి మోహన్ సినిమా ఆగిపోయింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోపి మోహన్ సునీల్ సినిమాపై స్పందిస్తూ ‘సునీల్ గారు కృష్ణాష్టమి సినిమా కోసం చాలా ఎక్కువ సమయం తీసేసుకున్నారు. దాంతో ఆ సినిమాని పక్కన పెట్టేసాను. ప్రస్తుతం కొత్త వారితో సినిమా చేయడానికి కథని సిద్దం చేసుకుంటున్నాను. డైరెక్టర్ నా మొదటి సినిమా అదే అవుతుందని’ గోపి మోహన్ తెలిపాడు. మరి గోపి మోహన్ డైరెక్టర్ గా చేయనున్న మొదటి సినిమాలో హీరోగా నటించే చాన్స్ ఏ హీరోకి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు