రీ రికార్డింగ్ దశలో సునీల్ చిత్రం !

రీ రికార్డింగ్ దశలో సునీల్ చిత్రం !

Published on May 28, 2017 3:41 PM IST


‘జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే’ వంటి చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆశించిన విజయం దక్కకపోవడంతో హీరో సునీల్ ఈసారి మాత్రం ఖచ్చితమైన హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంతో తన ఎంటర్టైన్మెంట్ జోనర్ నే నమ్ముకుని దర్శకుడు క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ అనే చిత్రం చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ మధ్యే డబ్బింగ్ కార్యక్రమాల్ని సైతం ముగించుకుంది.

ప్రస్తుతం రీ రికార్డింగ్ స్టేజిలో ఉన్న ఈ చిత్రం జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముదేన్దుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి, అలీ, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు