‘పవన్, రజిని’లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ !

‘పవన్, రజిని’లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ !

Published on Nov 19, 2019 10:00 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు. అలాగే మనం సైతం కాదంబరి కిరణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ , హీరో వెంకటేష్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

అనంతరం ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను కృష్ణ అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షణ చెయ్యాలని కృష్ణ. పిలుపునిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు