డా. మోహన్ బాబుకి ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు

డా. మోహన్ బాబుకి ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు

Published on Apr 17, 2014 4:57 PM IST

mohan-babu
చాలా కాలంగా డా. మోహన్ బాబు ఎదుర్కొంటున్న పద్మశ్రీ కేసు విషయంలో సుప్రీం కోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. 2007 లో మోహన్ బాబుకి పద్మశ్రీ ఇచ్చారు. ఈ మాధ్య విడుదలైన ‘దేనికైనా రెడీ’ సినిమాలో అనధికారికంగా పద్మశ్రీ అనేదాన్ని తన పేరు ముందుకు వేసుకున్నారని హై కోర్టులో కేసు వేసారు. దాంతో హై కోర్టు పద్మశ్రీని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.

దాంతో ఈ కేసుని సుప్రీం కోర్టు దృష్టికి తరలించారు. అక్కడ మోహన్ బాబు తరపు న్యాయవాది ఇకపై తన పేరు ముందు పద్మశ్రీ బిరుదును వాడాడు అని ఒక అఫిడవిట్ ను అందించారు. దాంతో హై కోర్టు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి అని ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ విషయంపై మంచు విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు