‘సైరా’ గట్టెక్కాలంటే ఇంకా వసూళ్లు రావాలి

‘సైరా’ గట్టెక్కాలంటే ఇంకా వసూళ్లు రావాలి

Published on Oct 23, 2019 11:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.106 కోట్ల వరకు రాబట్టింది. నిన్న 21వ రోజు సుమారు రూ.23 లక్షలు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా రూ.137 కోట్లను రాబట్టింది.

మామూలుగా చూస్తే ఇది పెద్ద మొత్తమే.. కానీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.155 కోట్లకు పైగానే జరిగింది. ఈ బ్రేక్ ఈవెన్ నెంబర్ అందుకోవాలంటే చిత్రం ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది.
కొత్త సినిమాల కారణంగా రాబోయే రోజులో థియేటర్ల సంఖ్య కూడా తగ్గుతుంది. వసూళ్లు తగ్గుముఖం పడతాయి. చిత్రం నైజాంలో ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించగా సినిమా ఫుల్ రన్ ముగిసేనాటికి ఏపీలోని బయ్యర్స్ కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల్లోనే కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో చిత్రం తీవ్ర నిరాశని మిగిల్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు