‘ఆనందో బ్రహ్మ’ లో హైలెట్ కానున్న నాలుగు పాత్రలు !

‘ఆనందో బ్రహ్మ’ లో హైలెట్ కానున్న నాలుగు పాత్రలు !

Published on Aug 17, 2017 4:09 PM IST


హీరోయిన్ తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపే రిలీజ్ కానుంది. ఈ సందేశార్బంగా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న నటి తాప్సి ఈ సినిమాలో స్టార్ హీరోలు లేనందు వలన సినిమాలోని డిఫరెంట్ కాన్సెప్ట్ ను జనాలకు దగ్గరచేసి ప్రచారం పొందాలని నిర్ణయించుకున్నామంటూ సినిమాలో కీలకమైన కామెడీ ఎలా పండిందో వివరించారు.

సినిమాలో వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డిలు నాలుగు పాత్రలు చేస్తున్నారు. వీరి నలుగురికి నాలుగు రకాలైన వైకల్యాలు ఉంటాయి. ఒకరికి అసలు వినిపించదు, ఇంకొకరికి గుండెకు సంబందించిన సమస్య, ఇంకొకరు ఎప్పుడూ తాగుతుంటాడు, మరొకరికి స్ప్లిట్ పెర్సనాలిటీ డిసార్డర్ . వీరిలో ఈ డిసాబిలిటీస్ లో నుండే కామెడీ పుడుతుందని, సినిమా కొత్తగా ఉంటుందని తాప్సి అన్నారు. జయ్ మరియు శశి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మహి వి రాఘవన్ డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు