వినూత్న ప్రమోషన్లు చేస్తున్న ‘నా నువ్వే’ !

వినూత్న ప్రమోషన్లు చేస్తున్న ‘నా నువ్వే’ !

Published on May 22, 2018 11:18 AM IST

కళ్యాణ్ రామ్, తమన్న జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమా జూన్ 1న విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు టీమ్. ఆ ప్రచారంలో భాగంగానే వినూత్న రీతిలో ఈ రోజు జరిగే ఐపిల్ మ్యాచ్ ప్రీ షోలో తమన్న, కళ్యాణ్ రామ్ ఈ చిత్రం గురించి మాట్లాడనున్నారు. ఒక సినిమాని ఈ విదంగా ప్రమోట్ చేయడం బహుశా తెలుగులో ఇదే మొదటిసారి.

ఈ రోజు చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కి ముందు జరిగే ఫ్రీ షోలో ఈ చిత్ర హీరో ,హీరోయిన్లు లైవ్ లో మాట్లాడనున్నారు. సాయత్రం 6 గంటలకి మా మూవీస్ లో ఈ షో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి పిసి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు