వరుసపెట్టి పలు భాషలలో వివిధ చిత్రాలలో నటిస్తూ తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తార తమన్నా. ఇప్పటికే పలు బ్రాండ్ లను అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా జీ తెలుగు ఛానల్ ని ప్రమోట్ చెయ్యనుంది.
ఈ ఛానల్ ప్రచారం కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. తమన్నా ప్రస్తుతం తాను నటిస్తున్న బాహుబలి షూటింగ్ చివరి స్టేజ్ లో పాల్గుంటుంది. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.