మిల్క్ బ్యూటీ తమన్నా చివరకు తిరిగి షూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఆమె కొన్ని యాడ్ ఫిల్మ్ ల షూటింగ్ లో ఉంది. అలాగే త్వరలో ఫిల్మ్ షూటింగ్ లో కూడా పాల్గొననుంది. అలాగే తనలోని మాటకారితో అహాలో వచ్చే ఓ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవ్వనుంది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ తన అహా కోసం తమన్నాతో ఓ టాక్ షోను ప్లాన్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఈ టాక్ షో షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
దసరా నుండి స్పెషల్ గా టెలికాస్ట్ అవుతుందట. కాగా తమన్నా హోస్ట్గా ఈ షో ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. అలాగే అభిమానులలకు కిక్ ఇచ్చేలా షోకి తమన్నా ఏ రేంజ్ లో క్రేజ్ తీసుకువస్తోందో కూడా చూడాలి. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దంపతులు, రవితేజ తదితర స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారని అప్పుడే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి తమన్నా తన ప్రశ్నలతో షోను ఎంతవరకు రక్తి కట్టిస్తుందో మరి.