తమిళంలో క్రేజీ హీరోయిన్ గా తెలుగమ్మాయి..

తమిళంలో క్రేజీ హీరోయిన్ గా తెలుగమ్మాయి..

Published on Dec 22, 2014 12:00 PM IST

Sri-Divya

రవిబాబు దర్శకత్వం వహించిన ‘మనసారా’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది తెలుగమ్మాయి శ్రీ దివ్య. ఆ తర్వాత మారుతి ‘బస్ స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో నటించింది. ముఖ్యంగా ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రసంశలు లభించాయి. కానీ, అవకాశాలు మాత్రం శూన్యం. ఇదే సమయంలో తమిళ సినిమా ప్రముఖులు శ్రీ దివ్యకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఆమె టాలెంట్ ను గుర్తించారు.

శ్రీ దివ్య నటించిన తమిళ సినిమాలు ఘన విజయాలు సాదించడంతో ఆమెను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో ఆమె నటించిన మొదటి సినిమా ‘వరుత్తిపాడు వాలిబార్ సంఘం’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవలసిన అవకాశం శ్రీ శివయకు రాలేదు. ఈ సినిమాను ‘కరెంట్ తీగ’ పేరుతో రీమేక్ చేశారు.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో షూటింగులతో బిజీ బిజీగా గడుపుతుంది. శివ కార్తికేయన్ సరసన నటించిన ఓ సినిమా తమిళ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మిగిలిన సినిమా కూడా క్రేజీ ప్రాజెక్టులే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు