ముఖ్యమంత్రుల సమక్షంలో బాలయ్య సినిమా లాంచ్ !

ముఖ్యమంత్రుల సమక్షంలో బాలయ్య సినిమా లాంచ్ !

Published on Mar 22, 2018 6:56 PM IST

దర్శకుడు తేజ ప్రస్తుతం బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో రూపొందాల్సిన ‘ఎన్టీఆర్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. ఆ మరుసటిరోజు షూటింగ్ కూడ జరపనున్నారు. పూర్తిస్థాయి రెగ్యులర్ షూట్ జూన్ లేదా జూలైలో మొదలవుతుంది.

రామకృష్ణ స్టూడియోస్ లో జరగనున్న ఈ ప్రారంభోత్సవ వేడుకకు తండ్రి సొంత ఊరు నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత ప్రాంతం కొమరవోలు నుండి అభిమానులను ఆహ్వానించిన బాలయ్య ఏపి ముఖ్యమంత్రి, వియ్యంకుడు చంద్రబాబు నాయుడును, తెలంగాణ ముఖుమంత్రి కేసీఆర్ ను కూడ ముఖ్య అతిధులుగా ఆహ్వానించారట. బాలక్రిష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందురిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేసే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు