సూపర్ స్టార్ గ్రాండ్ గా మొదలుపెట్టేశారు.

సూపర్ స్టార్ గ్రాండ్ గా మొదలుపెట్టేశారు.

Published on Dec 11, 2019 9:54 PM IST

రజిని తన 168వ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు శివతో చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సన్ నెట్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు చెన్నై వేదికగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. రజిని కాంత్ సీనియర్ హీరోయిన్స్ మీనా, కుష్బూ లతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజిని కాంత్ ఇమేజ్ , మేనరిజం కి తగ్గట్టుగా శివ మార్కు మాస్ కమర్షియల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. గత చిత్రాలకు మించి కొంచెం యాక్షన్ పాళ్ళు కూడా ఈ మూవీలో ఉండే అవకాశం కలదు. కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ అయిన మీనా, కుష్బూ లను తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. వారి పాత్రలు ఏమై ఉంటాయా అనే ఆసక్తి రేగుతోంది. కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రజిని కాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల అవుతుంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్బార్ ఉండనుంది. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు