నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తోన్న సినిమా పంతం. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమా మే 18న విడుదల కానుంది. మేహరిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. భారి యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఒక పాట, టాకీ పార్ట్ పూర్తయ్యాయని , ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మర్చి రెండోవారంలోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి.