రవితేజ టచ్ చేసి చూడు సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీతమ్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. ట్రైలర్ లో రవితేజ ఎనర్జీ చూపించాడు. సినిమా బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. డైరెక్టర్ విక్రమ్ సిరికొండ ఈ సినిమా పై నమ్మకంగా ఉన్నాడు. వక్కంతం వంశి అందించిన కథలో బలం ఉందని సమాచారం.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ నటించారు. రాశిఖన్నా ఒకరు, సీరత్ కపూర్ మరొకరు. ఇద్దరికి సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే లభించాయి. రాశిఖన్నా డాన్సర్ గా ఈ సినిమాలో కనిపిస్తుండగా సీరత్ కపూర్ రవితేజ ఫ్యామిలి ఫ్రెండ్ గా నటించింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆడియన్స్ స్టన్ అయ్యే విధంగా ఉండబోతుందని సమాచారం. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
- ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.