‘శ్రీమంతుడు’ సెన్సార్ కి ముహూర్తం కుదిరింది.!

‘శ్రీమంతుడు’ సెన్సార్ కి ముహూర్తం కుదిరింది.!

Published on Aug 3, 2015 12:43 PM IST

srimanthudu (2)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా రిలీజ్ కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది.. కానీ ఇంకా సెన్సార్ కాలేదని కొంతమంది అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వారి టెన్షన్ ని దూరం చేయడం కోసం శ్రీమంతుడు సెన్సార్ గురించిన పూర్తి విశేషాలు మేము తెలుసుకొని మీకందిస్తున్నాం.. మొదట జూలై 31న అనుకున్నారు, ఆ తర్వత జూలై 3 అనుకున్నారు.. కానీ టెక్నికల్ గా కొన్ని పనుల అంతరాయం వలన శ్రీమంతుడు సెన్సార్ నేడు జరగడం లేదు. మేము తెలుగుకున్న సమాచారం ప్రకారం రేపు అనగా ఆగష్టు 4వ తేదీ ఉదయం 9 గంటలకు సెన్సార్ వారు శ్రీమంతుడు సినిమాని చూడనున్నారు. దానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఈ చిత్ర నిర్మాతలు కచ్చితంగా సెన్సార్ వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని, అంతే కాకుండా సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఈ సినిమా ప్రింట్స్ అన్ని ఏరియాలకి వెళ్తాయి. మహేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమాని భారీ గా ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ ఈ కమర్షియల్ సినిమా ద్వారా ఓ మెసేజ్ ని కూడా ఇవ్వనున్నాడు. మహేష్ సరసన శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, అంగన రాయ్, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఆగష్టు 7న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు