ముఖ్యమంత్రి జగన్‌ ను కలిసిన సినీ ప్రముఖులు !

ముఖ్యమంత్రి జగన్‌ ను కలిసిన సినీ ప్రముఖులు !

Published on Feb 26, 2020 8:27 PM IST

తెలుగు సినీ ప్రముఖులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి, డి.సురేష్‌ బాబు, జెమిని కిరణ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు ఉన్నారు. అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ హుథ్‌ హుథ్‌ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనందున వాటిని ప్రారంభించి హుథ్‌హుథ్‌ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రిగారికి వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు