టచ్ చేసి చూడు ఆడియో విడుదల తేదిలో మార్పు !

టచ్ చేసి చూడు ఆడియో విడుదల తేదిలో మార్పు !

Published on Jan 23, 2018 8:00 PM IST

రవితేజ నటించిన తాజా సినిమా టచ్ చేసి చూడును ఫిబ్రవరి 2 న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది.
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విక్రమ్ సిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నాడు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ఆడియో విడుదలను మొదట ఈ నెల 25న ప్లాన్ చేసారు కాని తాజా సమాచారం మేరకు 27వ తేదిన భారీగా ఈ సినిమా ఆడియో రిలీజ్ చెయ్యబోతున్నారు. రాశిఖన్నా, శీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ యాక్షన్ హైలెట్ కాబోతుందని సమాచారం. వక్కంతం వంశి అందించిన కథతో దర్శకుడు చక్కగా స్క్రీన్ ప్లే రాసుకొని తెరకెక్కించాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు