సెన్సార్ పూర్తిచేసుకున్న ‘టచ్ చేసి చూడు’ !

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘టచ్ చేసి చూడు’ !

Published on Jan 24, 2018 3:37 PM IST

ర‌వితేజ తాజా సినిమా ‘ట‌చ్ చేసి చూడు’. రాశీ ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ క‌థానాయిక‌లు. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ లభించింది. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నారు యూనిట్.

పోలీస్ ఆఫీసర్ గా రవితేజ చేసిన నటన ఈ సినిమాకు హైలెట్ కానుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తరువాత రవితేజ నటించబోతున్న ‘నేల టికెట్’ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు