మళయాల సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్న త్రిష!

మళయాల సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్న త్రిష!

Published on Dec 8, 2016 1:17 PM IST

trisha
గత కొద్దికాలంగా హీరోయిన్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న త్రిష, హీరో ప్రధాన సినిమాల్లోనూ తనకంటూ ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ‘ధర్మయోగి’ అనే సినిమాలో ఎవ్వరి ఊహకూ అందకుండా ఓ నెగటివ్ రోల్ చేసి త్రిష ఇప్పుడు సౌతిండియన్ సినిమాలో మళ్ళీ టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె దాదాపుగా నాలుగు సినిమాల్లో పలు ఇంటరెస్టింగ్ రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మళయాల సినీ పరిశ్రమకు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మళయాలంలో ఇప్పుడున్న యువహీరోల్లో క్రేజీ హీరో అయిన నివిన్ పాలీ నటించే సినిమాలో త్రిష ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారట. జాతీయ అవార్డు గ్రహీత అయిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో త్రిష రోల్ చాలా కొత్తగా ఉంటుందట. ఆ రోల్‌కు త్రిష అయితేనే బాగుంటారని పట్టుబట్టి ఆమెనే ఎంపికచేశారట. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మెప్పించిన త్రిష, ఇప్పుడు మళయాల ప్రేక్షకులనూ మెప్పించనున్నారన్నమాట!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు