ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్క నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘రుద్రమదేవి’. తాజాగా నానక్రామ్ గూడా లో వేసిన రుద్రమదేవి సెట్ లో నుంచి చాలా ఖరీదైన బంగారు, వెండి నగలు దొంగతనానికి గురయ్యాయని ఇది వరకే తెలియజేశాం. రాయదుర్గం పోలీసుల ఇన్వెస్టిగేషణ్ లో ఒక పెద్ద క్లూని పట్టుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం రుద్రమదేవి సెట్లో మాయమైన సుమారు 10 కేజీల నగలు నాదెళ్ళ ఆంజనేయశెట్టి గోల్డ్ మేకర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయిన రవి సుబ్రహ్మణ్యం ఇంట్లో బయటపడ్డాయి. రవి మాత్రం కమేప్నీ నగలు ఇంటిలో పెట్టుకున్నాను అంతే గానీ వీటికి ఓనర్ కి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. దాంతో మొదటి క్లూగా రవిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కొన్ని విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అసలైన నిందితులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది. గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి నీతాలుల్ల నగలను డిజైన్ చేసారు.