అదృష్టాన్ని పరీక్షిణించుకోనున్న ఇద్దరు దర్శకులు !

అదృష్టాన్ని పరీక్షిణించుకోనున్న ఇద్దరు దర్శకులు !

Published on Mar 20, 2018 12:12 PM IST

గతంలో శ్రీను వైట్ల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఉపేంద్ర మాధవ్ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘ఎంఎల్ఎ’. కళ్యాణ్ రామ్, కాజల్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కామెడి బాగుండబోతోందని సమాచారం. మణిశర్మ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.

దర్శకుడు మదన్ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వేణు ఊడుగుల తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘నీది నాది ఒకే కథ’. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. యూత్ కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం. ‘నీది నాది ఒకే కథ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ వారం ఇద్దరు కొత్త దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు