సెమీ ఫైనల్స్ కి వెళ్ళిన తెలుగు వారియర్స్ టీం

సెమీ ఫైనల్స్ కి వెళ్ళిన తెలుగు వారియర్స్ టీం

Published on Jan 25, 2015 1:08 PM IST

Telugu-Woriers
తెలుగు వారియర్స్ టీం ఎంతో సక్సెస్ఫుల్ గా సిసిఎల్ 5 లో దూసుకుపోతోంది. ప్రతి మ్యాచ్ లలోనూ మంచి ఆటతీరును కనబరుస్తూ మూడు విజయాలను అందుకొని సెమీ ఫైనల్స్ లోకి వెళ్ళింది. చూస్తుంటే తెలుగు వారియర్స్ టీం ని ఈ సారి ఎవరూ అడ్డుకునేలా కనపడడం లేదు. ఎందుకంటే నిన్న కర్నాటక బుల్డోజర్స్ తో జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో తెలుగు వారియర్స్ రికార్డ్ విన్నింగ్ ని నమోదు చేసింది.

మొదటగా బ్యాటింగ్ చేసిన ఈగ ఫేం సుదీప్ టీం కర్ణాటక బుల్డోజర్స్ టీం 187 పరుగుల టార్గెట్ ని తెలుగు వారియర్స్ ముందు ఉంచింది. తెలుగు వారిఅర్స్ రికార్డ్ స్థాయిలో ఆడి వారు ఇచ్చిన లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. ఇందులో తెలుగు వారియర్స్ టీం నుంచి ప్రిన్స్ 46 బంతుల్లో 67 పరుగులు చేయగా, సుధీర్ బాబు 26 బంతుల్లో 39 పరుగులు, చివరిగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ 8 బంతుల్లో 21 పరుగు చేసి తెలుగు వారియర్స్ టీంకి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో ప్రిన్స్ కి మాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు