నర్సాపురంలో వరుణ్‌తేజ్ ‘కంచె’

నర్సాపురంలో వరుణ్‌తేజ్ ‘కంచె’

Published on Apr 2, 2015 2:48 PM IST

varun-tej
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో.. వరుణ్ తేజ్. తన మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు వరుణ్. ఇప్పుడు తాజాగా ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘కంచె’ అన్న టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 27న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరిగింది. సినిమా కోసం నిర్మించిన ఓ భారీ సెట్‌లో షూటింగ్ జరిగింది.

రెండో షెడ్యూల్‌లో తాటిపాక పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ జరపగా ఇప్పుడు తాజాగా పదిహేను రోజుల పాటు నర్సాపురంలో షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ ఇప్పటికే మొదలైంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేశేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు