మెగా హీరో వరుణ్ తేజ్ తాజ్ చిత్రం ‘ఫిదా’ గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. బలమైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తేజ్ కు ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఆయన తన తర్వాతి సినిమాను కూడా మొదలుపెట్టేయనున్నాడు. రేపటి నుండే ఆ ప్రాజెక్ట్ మొదలుకానుంది. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
ఈ చిత్రం కూడా ‘ఫిదా’ లానే రొమాంటిక్ ఎంటర్టైనర్ లా ఉంటుందని తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్ రాశి ఖన్నా వరుణ్ తేజ్ కు జోడిగా నటించనుంది.