విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు

Published on Jan 25, 2015 8:35 PM IST

Kota-Srinivasa-Rao1
తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన విలక్షణ నటులలో కోట శ్రీనివాసరావు పేరుని ముందు వరుసలో చెప్పుకోవచ్చు. దాదాపు 37 సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటుడిగా కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు కి భారత ప్రభుత్వం అరుదైన ఘనత దక్కింది. ఇన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కోటశ్రీనివాసరావుని పద్మ అవార్డులలో భాగంగా పద్మ శ్రీ తో భారత ప్రభుతం సత్కరించింది.

1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోట శ్రీనివాసరావు అనతి కాలంలోనే తన నటనలోని టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రని వేసుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించాడు. కోట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా పలు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా కోట శ్రీనివాసరావుకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు