విడుదలైన విక్రమ సింహా ట్రైలర్

విడుదలైన విక్రమ సింహా ట్రైలర్

Published on Apr 20, 2014 1:25 AM IST

Vikramasimha-Audio-Launch-0
రజిని కాంత్ నటించిన కొచ్చాడయాన్ కి తెలుగు డబ్ వెర్షన్ గా విక్రమ సింహా సినిమా వస్తున్న విషయం తెలిసినదే. ఈ రెండు భాషలేకాక పలు ఇతర భాషలలో కూడా ఈ సినిమా మే 9న విడుదలకానుంది. సౌందర్య రజినికాంత్ దర్శకురాలు. దీపికా పదుకునె హీరోయిన్. రుక్మిణి, శోభన, నాజర్, శరత్ కుమార్, ఆది మరియు జాకీ షరాఫ్ వాటి నటులు ఈ చిఎమలొ నటించారు

ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని కర్టైన్ రైజర్ రూపంలో ఆవిష్కరించారు. రామానాయుడు, దాసరి నారాయణరావు, రాజమౌళి, రమేష్ ప్రసాద్, టి. సుబ్బిరామిరెడ్డి, మంచు లక్ష్మి, మోహన్ బాబు వంటి తారలు ఈ వేడుకకు వచ్చారు. రజిని సతీ సమేతంగా కూతురితో పాటు వచ్చారు

ఈ వేడుకలో రజిని మాట్లాడుతూ “గతకొనేళ్ళుగా నాకు మంచి ఆఫర్లు రావడం దేవుని కృప. బాబా తరువాత ఎటువంటి పాత్రలు చెయ్యాలని ఆలోచిస్తున్న తరుణంలో శివాజీ, రోబో వంటి కధలతో దర్శకులు నన్ను సంప్రదించారు. ఈ ప్రాజెక్ట్ ని తీయడం అంట తేలిక కాదు. ఈ సినిమాను ఎలా తీద్దాం అనుకుందో నాకు తెలియదు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు

ఇటువంటి సాహసోపేత సినిమా తీసినందుకు సౌందర్యని దాసరి మరియు మోహన్ బాబులు ప్రశంసించారు. “తన మొదటిక్ సినిమాతోనే యావత్ భారతదేశాన్ని తావైపు తిప్పుకుందని. తనకు సౌందర్య కూతురితో సమానమని, తనని చూస్తే చాలా గర్వంగా వుందని” మోహన్ బాబు తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ “ఈ సినిమాను రెండేళ్లలో ఎలా తీసారో నాకు నమ్మబుద్ది కావడంలేదు. ఈగ సినిమాలో ఒక్క పాత్రకు మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానం వాడినందుకే నాకు రెండేళ్ళు పట్టింది. సౌందర్యకి ఆమె బృందానికి హ్యాట్స్ ఆఫ్” అని తెలిపారు

ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. రవికుమార్ కధను అందించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు